హైదరాబాద్ : కరోనా బారి నుంచి సీఎం కేసీఆర్ పూర్తిగా కోలుకున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలోనూ కేసీఆర్కు నెగెటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యులు స్పష్టం చేశారు.
ఏప్రిల్ 19న సీఎం కేసీఆర్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలుండటంతో వైద్యుల సూచన మేరకు ఆయన గజ్వేల్లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్లో ఉన్నారు.
ఇటీవల ఆయనకు వైద్య బృందం సోమాజిగూడ యశోదలో సాధారణ పరీక్షలు నిర్వహించగా ఎలాంటి సమస్య లేదని తేలింది. సీఎం కేసీఆర్కు నిర్వహించిన యాంటిజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులు రెండింటిలోనూ ఆయనకు నెగిటివ్ వచ్చింది. ఆయన రక్త నమూనా పరీక్ష ఫలితాలు సైతం సాధారణంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.