కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని హసీమారా ఎయిర్బేస్లో రాఫెల్ యుద్ధ విమానాల రెండవ స్క్వాడ్రన్ను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. చీఫ్ మార్షల్ ఆర్కెఎస్ భదౌరియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 101 స్క్వాడ్రన్ను ఆరు రాఫెల్ విమానాలతో ప్రారంభించారు.
కాగా, గత ఏడాది రాఫెల్ యుద్ధ విమానాల మొదటి స్క్వాడ్రన్ను హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. మొత్తం 36 అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలను రూ.59,000 కోట్లతో కొనుగోలుకు ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్తో మోదీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ సంస్థ ఇప్పటికే 26 రాఫెల్ విమానాలను భారత్కు అందజేసింది. మరో పది రాఫెల్స్ ఈ ఏడాది చివరి నాటికి సరఫరా కానున్నాయి.