భోపాల్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం క్రమంగా తగ్గుతుండటంతో వివిధ రాష్ట్రాలు స్కూళ్లు, కాలేజీల్లో ఆఫ్లైన్ తరగతులను ప్రారంభిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రం కూడా ఆ జాబితాలో చేరింది. అక్కడ ఈ నెల 25 నుంచి ఇంటర్ తరగతులను పునఃప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ప్రకటించారు. అయితే కేవలం 50 శాతం విద్యార్థుల కెపాసిటితో మాత్రమే తరగతులు కొనసాగుతాయని ఆయన చెప్పారు.
అదేవిధంగా రాష్ట్రంలో కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిందని శివరాజ్సింగ్ చౌహాన్ చెప్పారు. ప్రస్తుతం మహమ్మారి అదుపులోనే ఉన్నదని, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. థర్డ్ వేవ్ ప్రబలకుండా కట్టడి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.