తిరువనంతపురం: నవంబర్ 1 నుంచి కేరళలో విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు తరగతులు జరుగనున్నాయి. మిగతా విద్యార్థులకు నవంబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో విద్యాసంస్థలు ప్రారంభం అవుతాయిని తెలిసింది.
పాఠశాలల పునః ప్రారంభంపై కేరళ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ పాఠశాలలను ప్రాంభించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాగా రాష్ట్రంలో కొత్తగా 19,675 కరోనా కేసులు, 142 మరణాలు సంభవించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1.61 లక్షల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.