వరంగల్ రూరల్ : జిల్లాలోని చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో చేతబడి చేస్తున్నారనే విషయం కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు..గ్రామంలో ఎప్పటి లాగే అరుబయట మంచంలో పడుకున్న చీమల సతీష్ అనే వ్యక్తి ఉదయం లేచి చూసేసరికి కనపడలేదు. చుట్టు పక్కల వెతకగా పడుకున్న వ్యక్తి మంచం పక్కన చేతబడి చేసి ఉండడం చూసి ఒక్కసారిగా గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. సతీష్ పడుకున్న మంచం పక్కన మనిషి బొమ్మ , ముగ్గు గీసి అందులో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, మిరపకాయలు, బొగ్గు వేసి చేతబడి చేసిన ఆనవాళ్లు ఉన్నాయి.
సతీష్ పడుకున్న మంచంలో అతని సెల్ ఫోన్ అలాగే ఉంది. సతీష్ మాత్రం కనిపించడం లేదు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాత్రి వాళ్లెవరు ఇంట్లో లేరు. భార్య, తల్లి, బంధువులు ఆందోళన చెందుతున్నారు.
గతంలో ఇదే తరహాలో ఒక వ్యక్తి అదృశ్యమైనా ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదని గ్రామస్తులు అధికారులకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
ఇవి కూడా చదవండి..
ప్రజా సేవలో పోలీసులు అంకితం కావాలి
మెడికల్ హబ్గా మహబూబాబాద్ : మంత్రి సత్యవతి
ఆనంద్తో చెస్ ఆడనున్న ఆమిర్ ఖాన్