చండీగఢ్: కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల 31 వరకు అన్ని స్కూళ్లు, కాలేజీలు మూసివేస్తున్నట్లు పరిపాలనా యంత్రాంగం తెలిపింది. 9, 11 తరగతుల విద్యార్థులకు భౌతిక పరీక్షల నిర్వహణపై సమీక్ష జరుపుతామని విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు. అవసరమైతే పరీక్షల షెడ్యూల్ మార్పు చేస్తామని చెప్పారు. మూడు నుంచి 8వ తరగతి విద్యార్థులకు ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది విధులకు హాజరుకావాలని విద్యా శాఖ స్పష్టం చేసింది.
కాగా, చండీగఢ్లో గత 24 గంటల్లో 208 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1979కి చేరింది. ఇప్పటి వరకు కరోనా వల్ల 363 మంది మరణించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో హోళి వేడుకలను రద్దు చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్స్లో వీటిని నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేశారు.