సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో విలువైన క్షణాలు గడుపుతున్నాడు.ముఖ్యంగా పిల్లలు సితార, గౌతమ్తో కలిసి తెగ సందడి చేస్తుంటాడు. చిన్న పిల్లాడిలా మారి మహేష్ చేసే సందడిని నమ్రత తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేస్తుండగా, ఇవి నెటిజన్స్ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా కూతురు సితారతో ఫన్ మూమెంట్కి సంబంధించిన ఫొటో షేర్ చేయగా.. అది నెటిజన్స్ను ఎంతగానో ఆకట్టుకుంటున్నది.
మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే దుబాయ్లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్కు సిద్ధమయ్యింది.