న్యూఢిల్లీ, జూలై 22: కరోనా సోకి/కుటుంబసభ్యులకు కరోనా సోకడం వల్ల ఐసోలేషన్లో ఉండి గతేడాది సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయలేకపోయిన అభ్యర్థులు.. సంబంధిత అధికారులను మరో అవకాశం కోరవచ్చని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అధికారులు విజ్ఞప్తిని స్వాగతించి అభ్యర్థులకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. పరీక్షలు రాయడానికి మరో అవకాశం కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ సూచనలు చేసింది. పిటిషన్లను కొట్టేసింది.