న్యూఢిల్లీ: నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) వేదికలపై నియంత్రణలకు సంబంధించి వివరాలను సమర్పించాలని సర్వోన్నత న్యాయస్ధానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఓటీటీ వేదికలపై ప్రసారమయ్యే కార్యక్రమాలకు స్క్రీనింగ్ అవసరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. స్ట్రీమింగ్ సేవలపై కంటెంట్ను నియంత్రించేందుకు స్వతంత్ర నియంత్రణ సంస్ధ ఏర్పాటును కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా దీనిపై బదులివ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది.
టీటీ వేదికలకు స్వయం నియంత్రణ యంత్రాంగాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రి ప్రకాష్ జవదేకర్ ఇటీవల ప్రతిపాదించిన నేపథ్యంలో సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. వివాదాస్పద వెబ్ సిరీస్ తాండవ్పై దర్యాప్తు నేపథ్యంలో తాను దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్కు వ్యతిరేకంగా అమెజాన్ ప్రైమ్ ఇండియా కంటెంట్ హెడ్ అపర్ణా పురోహిత్ అప్పీల్పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.