న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ను ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) సీనియర్ నేత సంజయ్ సింగ్ ఆదివారం కలిశారు. ఉత్తరప్రదేశ్లో తాజా రాజకీయాలు, జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తదితర అంశాల గురించి ఇద్దరు మాట్లాడుకున్నారు. ఈ స్థానిక ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ ఐదు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. మరోవైపు వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అఖిలేష్ యాదవ్, సంజయ్ సింగ్ భేటీ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ, ఆప్ మధ్య ఎన్నికల పొత్తు ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని బీఎస్పీ, కాంగ్రెస్ స్పష్టం చేశాయి.