న్యూఢిల్లీ : డబ్బులు ఇచ్చినవారికి పార్టీ టికెట్లు అమ్మేందుకు సిద్ధమని నిషాద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషాద్ అన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఓ జాతీయ వార్తా చానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్లో నిషాద్ అడ్డంగా బుక్కయ్యారు. న్యూస్ చానెల్ విలేకరి పొలిటికల్ కన్సల్టెంట్గా పరిచయం చేసుకోగా ఆయన సమక్షంలో నిషాద్ పలు వ్యాఖ్యలు చేశారు. మాయావతి ఫార్ములాను ఉదహరిస్తూ ఆయన సీట్ల అమ్మకానికి సిద్ధమేనని పేర్కొన్నారు.
తాను అధికారం, డబ్బు, కేడర్ లేని పార్టీకి నాయకుడినని, తమ టార్గెట్ 2024, 2027 ఎన్నికలేనని అందుకే తాను ఎస్పీని నాశనం చేయాలనుకుంటున్నానని చెప్పారు. బీజేపీని దెబ్బతీయాలని ఎస్పీ భావిస్తుంటే అఖిలేష్ పార్టీని సజీవంగా ఉంచాలని యోగి ఆదిత్యానాధ్ కోరుకుంటున్నారని అన్నారు. కాగా ఈ స్టింగ్ ఆపరేషన్ బూటకమని తనను, తన పార్టీని దెబ్బతీసేందుకు జరిగిన కుట్రగా నిషాద్ అభివర్ణించారు.