కరోనా సెకండ్ వేవ్ జడలు విప్పి మానవాళి జీవనాన్ని ఛిన్నా భిన్నం చేస్తోంది. తలిదండ్రులను పిల్లలకు, పిల్లలను పెద్దలకు కాకుండా కుటుంబ వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ఒక కుటుంబంలోని ఒకరి వచ్చిన వైరస్.., ఆ త్వరితగతిన కుటుంబమంతా పాకి కుటుంబాన్ని సర్వ నాశనం చేస్తోంది. కరోనా వైరస్ను విషయాన్ని తేలికగా తీసుకోవద్దని వైద్య నిఫుణులు ప్రతి ఒక్కరికీ చెబుతుతున్నారు. ఎవరైతే ఈజీగా తీసుకుంటారో.. అలాంటి వారికి దాని తీవ్రతేమిటో తెలిసేలా చేస్తుంది. ఈలోగా జరగాల్సినదంతా జరిగిపోతోంది. విపత్తు సంభవిస్తే.. అడుగు వెనక్కు తీసుకోలేం అని ముందు జాగ్రత్తగా అధికార యంత్రాంగం, వైద్య నిఫుణులు పదే పదే చెబుతున్నారు.
కొవిడ్ కుటుంబంలోని ఒకరికి చేరి మిగతా సభ్యులందరి బతుకుల్ని ఛిద్రం చేస్తోంది. సెకండ్ వేవ్ వైరస్ కాస్త దూకుడుగా వ్యవహరిస్తూ కుటుంబాలకు తట్టుకోలేని విపత్తును మిగుల్చుతోంది. గచ్చిబౌలి జీపీఆర్ఏ క్వార్టర్స్లోని కేంద్రియ విద్యాలయలో టీచర్గా పనిచేస్తూ లింగంపల్లిలోని సుదర్శన్నగర్లో ఉంటున్న శ్రీవల్లి ఇంట్లో కరోనా విషాదం నెలకొంది. కరోనాతో చికిత్స పొందుతూ శ్రీవల్లి గత శనివారం మృతి చెందారు. ఆమెతో పాటే ఆమె తండ్రి నర్సింగరావు కరోనాతో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయారు. కుమారుడు వెంకటేశ్ కరోనాతో చికిత్స తీసుకుంటున్నాడు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన వెంకటేశ్ పరిస్థితిని చూసి బంధువులు, స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇలా మాయదారి కరోనా ఇంటిల్లిపాదిని ఛిద్రం చేస్తోంది. సెకండ్ వేవ్లో కరోనా మహహ్మరి బంధాల్ని విచ్ఛిన్నం చేస్తున్నది. కన్న కడుపు కోత వేదనతో తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు, పెద్ద దిక్కుగా ఉన్న ఇంటి పెద్దలను కోల్పోతున్న పిల్లలు, ఇంటికి ఆదెరువుగా నిలిచే తండ్రిని కోల్పోయిన కొడుకు, కనీసం దహన సంస్కారాలను నిర్వహించేలా బంధుగణం దగ్గరికి రాని పరిస్థితులు ఇలా కుటుంబాల్లో తీరని వేదనను, కన్నీటి రోదనను మిగులుస్తోంది.