ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మంగపేట మండలంలో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. వర్షం తగ్గుముఖం పడుతున్న సమయములో మల్లూరు గ్రామ సమీపంలో గండి వెంకన్న(55) అనే గీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కి కల్లు గిస్తుండగా పిడుగు పడింది.
దీంతో వెంకన్న చెట్టు మీద నుంచి కిందికి జారి పడ్డాడు. అపస్మారక స్థితికి వెళ్లిన వెంకన్నను వైద్యం కోసం కుటుంబ సభ్యులు వరంగల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పండగవేళ వెంకన్న మృతిచెందడంతో మల్లూరు గ్రామంలో విషాదం అలముకుంది. కాగా మృతుడికి భార్య ఒక కుమారుడు ఉన్నారు.
కొండగొర్రె మాంసం విక్రేతల అరెస్ట్
సూర్యాపేట జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం
స్వీయ నియంత్రణయే శ్రీరామ రక్ష : మంత్రి ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు