న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం భారత్ బంద్ నిర్వహించనున్నట్టు రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. ఈ చట్టాలను రద్దు చేయాలని ఎన్నిసార్లు సూచించినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తమ నిరసనను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికే ఈ బంద్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. అన్ని రంగాల ప్రజలు బంద్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది.