న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల నిరసనలను ముందుండి నడిపిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సెప్టెంబర్ 25న భారత్ బంద్కు పిలుపు ఇచ్చింది. వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు నిరసనగా గత ఏడాది నవంబర్ నుంచి జరుగుతున్న ఆందోళనలను మరింత ఉధృతం చేసేందుకు బంద్కు పిలుపు ఇచ్చామని ఎస్కేఎం వెల్లడించింది.
సింఘు బోర్డర్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్కేఎం ప్రతినిధి అశీష్ మిట్టల్ మాట్లాడుతూ భారత్ బంద్ వివరాలను తెలిపారు. గత ఏడాది ఇదే రోజున తాము దేశవ్యాప్త బంద్ను జరిపామని గుర్తు చేశారు. కరోనా మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న సమయంలో గత ఏడాది జరిగిన బంద్ కంటే ఈసారి భారత్ బంద్ మరింత విజయవంతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.