లక్నో : సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత ఐపీ సింగ్పై లక్నోకు చెందిన ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బెదిరింపులకు గురిచేశాడనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు అవదేష్ సింగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తాను కొద్దిరోజుల కిందట ఐపీ సింగ్ నుంచి రూ 34 లక్షలు తీసుకున్నానని, కరోనా మహమ్మారితో పాటు వ్యక్తిగత సమస్యలతో ఆయనకు ఆ మొత్తం తిరిగి ఇవ్వలేకపోయానని పేర్కొన్నారు. అక్టోబర్ తర్వాత డబ్బు తిరిగిఇస్తానని ఎస్పీ నేతను తాను కోరానని చెప్పారు.
తాను చెప్పింది వినిపించుకోని సింగ్ ఆదివారం తన స్నేహితుడు మనోజ్ సింగ్ ఇతర అనుచరులతో వచ్చి తనను కిడ్నాప్ చేసి వారి ఇంట్లో ఓ గదిలో నిర్బంధించారని ఆరోపించారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ఐపీ సింగ్ ఆయన సోదరుడు మనోజ్ సింగ్ అనుచరుడు ఉదయ్ యాదవ్ ఇతరులపై కిడ్నాప్, హత్యాయత్నం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. కాగా తనపై ఆరోపణలు నిరాధారమని రాజకీయంగా తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారని సింగ్ పేర్కొన్నారు.