న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు విజయ్ దివస్ సందర్భంగా యావత్ దేశం ఘనంగా నివాళులర్పించింది. 1999లో జరిగిన ఈ యుద్ధంలో భారత పరాక్రమాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఆ ధీరోదాత్తులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోమవారం ఘనంగా నివా ళులర్పించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, సీఎంలు కూడా నివాళులర్పించారు.