క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలి
జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ
ఉమ్మడి జిల్లాస్థాయి ముగింపు పోటీలకు హాజరు
విజేతలకు బహుమతుల ప్రదానం
వేములవాడ రూరల్, ఏప్రిల్ 5: కబడ్డీ ఆటకు విశేష ఆదరణ ఉందని, క్రీడాకారులు జాతీయస్థాయిలోనూ రాణించాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ ఆకాంక్షించారు. వేములవాడ రూర ల్ మండలం చెక్కపల్లిలో కబడ్డీ కోచ్ ఎడపెల్లి లక్ష్మణ్ స్మారకార్థం నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఈ పోటీలకు చైర్పర్సన్ హాజరై భూంపల్లి (ప్రథమ), నూకలమర్రి (ద్వితీయ), చెక్కపల్లి (తృతీయ) జట్లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడు తూ, క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. క్రీడలతోనూ ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలిపారు. ఇక్కడ జడ్పీటీసీ ఏశ వాణి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఏశ తిరుపతి, సర్పంచ్ అడ్డిక జైపాల్రెడ్డి, ఎంపీటీసీ వెలుమ నర్సవ్వ, ఉప సర్పంచ్ మంజుల, లయ యూత్ క్లబ్ అధ్యక్షుడు వంగ వంశీకృష్ణ, ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, కార్యదర్శి సంపత్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యాచమనేని శ్రీనివాస్రావు, ప్రధాన కార్యదర్శి మల్లికార్జు న్, యూత్ క్లబ్ సభ్యులు రాజు, సత్యం, మహేశ్, పరశురాం తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఒక్క గ్రామానికి ఏడాదికి 3.37 కోట్లు