ఢిల్లీ వర్సిటీ కళాశాల ఆదేశాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: మావోయిస్టులతో సంబంధాలు కలిగిఉన్నారన్న ఆరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలిగిస్తున్నట్టు ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రామ్లాల్ ఆనంద్ కాలేజీ యాజమాన్యం శనివారం వెల్లడించింది. ఈ మేరకు సాయిబాబా భార్య వసంతకు గురువారం కాలేజీ ప్రిన్సిపాల్ ఉత్తర్వులు జారీచేశారు. మార్చి 31, 2021 నుంచి సాయిబాబాను సర్వీసుల నుంచి తొలిగిస్తున్నట్టు, అలాగే మూడు నెలల వేతనాన్ని కూడా ఇస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై వసంత స్పందిస్తూ.. ఇది ఒక ఉద్యోగి హక్కులను కాలరాయడమేనని ధ్వజమెత్తారు. దీనిపై కోర్టులో సవాల్ చేస్తామన్నారు. కాగా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో సాయిబాబాను 2014లో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. నాగ్పూర్ కేంద్ర కారాగారంలో ఆయన జీవితఖైదు అనుభవిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
దీదీ.. మీరు వారణాసిలో పోటీ పడొచ్చు!
రేపటి నుంచి 71 అన్రిజర్వ్డ్ రైలు సర్వీసులు
సుప్రీంకోర్టుకు ‘ఇస్రో కుట్ర కేసు’ నివేదిక