ముంబై: పోలీస్ అధికారి సచిన్ వాజ్ను గతంలో బాంబే హైకోర్టు 16 ఏండ్లు సస్పెండ్ చేసిందని మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఆయన సస్పెన్షన్ రద్దు చేయాలని శివసేన డిమాండ్ చేసిందని ఆదివారం మీడియాతో అన్నారు. శివనేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కరోనా సాకుతో ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకున్నదని విమర్శించారు. అంతేగాక సచిన్ వాజ్ను క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ చీఫ్గా చేసి అనేక ప్రధాన కేసులు అప్పగించారని ఆరోపించారు.
సచిన్ వాజ్ అరెస్ట్ నేపథ్యంలో ప్రభుత్వంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని ఫడ్నవిస్ మండిపడ్డారు. సీఎం, హోంమంత్రి ఆయన న్యాయవాదుల మాదిరిగా వాజ్ను రక్షిస్తున్నారని విమర్శించారు. దీనికి సంబంధించి ఒక కోణం మాత్రమే బయటకు వచ్చిందని తాను భావిస్తున్నానని అన్నారు. మన్సుఖ్ హిరెన్ మరణం కేసుపై దర్యాప్తు పూర్తయితే ఇందులో ఎవరి ప్రయేయం ఉన్నది, వారి ఉద్దేశం ఏమిటి అన్నది బయటపడుతుందని వ్యాఖ్యానించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.