మితి నదిలో ల్యాప్టాప్, నంబర్ ప్లేట్లను స్వాధీనం చేసుకొన్న ఎన్ఐఏ
ముంబై, మార్చి 28: అంబానీ ఇంటిదగ్గర పేలుడు పదార్థాలతో ఉన్న కారు యజమాని హీరేన్ మన్సుఖ్ హత్య కేసులో ఎన్ఐఏకు కీలక ఆధారాలు లభించాయి. కేసులో నిందితుడు రియాజుద్దీన్ ఇచ్చిన సమాచారం మేరకు మితి నదిలో గాలించి డిజిటల్ వీడియో రికార్డర్, సీపీయూలు, ల్యాప్టాప్, రెండు నంబర్ ప్లేట్లను స్వాధీనం చేసుకొన్నది. డిజిటల్ వీడియో రికార్డర్ సచిన్ వాజే నివసిస్తున్న హౌసింగ్ సొసైటీలోది కావొచ్చని అనుమానిస్తున్నారు. హీరేన్ మృతి కేసులో ఎన్ఐఏ అధికారులు కాజీని విచారించగా.. వాజే ఆదేశాలతో ఆధారాలను మితి నదిలో పడేసినట్టు చెప్పాడు.
ఇవీ కూడా చదవండి
సౌండింగ్ రాకెట్ను ప్రయోగించిన ఇస్రో
మార్స్పై గాలి శబ్దాన్ని రికార్డ్ చేసిన నాసా రోవర్