దేశంలో తొలి మహిళా న్యాయమూర్తి అన్నా చాందీ 1905 లో సరిగ్గా ఇదే రోజున జన్మించారు. కేరళలోని త్రివేండ్రం లో జన్మించిన అన్నా చాందీ 1926 లో త్రివేండ్రం లోని ప్రభుత్వ లా కాలేజీ నుంచి న్యాయ పట్టా పొందారు. కేరళ నుంచి న్యాయ పట్టా పొందిన మొదటి మహిళ కూడా ఆమె. 1929 నుంచి లా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1930 లో ‘మిసెస్’ అనే పత్రికను ప్రారంభించి.. మహిళల స్వేచ్ఛ, వితంతు వివాహం, మహిళలకు సంబంధించిన సమస్యలపై కథనాలు వ్రాయడం ప్రారంభించారు.
1931 లో క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనాలని నిర్ణయించుకుని.. శ్రీ మూలం అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి ఓటమి చెందారు. అయితే, ఓటమిని అంత త్వరగా జీర్ణించుకోని ఆమె.. అనంతరం ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1937 లో ట్రావెన్కోర్ దివాన్ ఆమెను మున్సిఫ్గా నియమించారు. దీంతో ఆమె దేశానికి తొలి మహిళా న్యాయమూర్తి అయ్యారు. అన్నా చాందీ ఇక ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. 1948 లో ఆమె జిల్లా న్యాయమూర్తి అయ్యారు.
1959 ఫిబ్రవరి 9 న అన్నా కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1967 ఏప్రిల్ 5 వరకు ఈ పదవిలో ఉన్నారు. పదవీ విరమణ చేసిన అనంతరం భారతదేశ లా కమిషన్ చైర్పర్సన్గా నియమితులయ్యారు. 1996 జూలై 20 న జస్టిస్ చాందీ తన 91 సంవత్సరాల వయసులో మరణించారు.
2008: ప్రముఖ తబలా ఆటగాడు పండిట్ కిషన్ మహారాజ్ మరణం
1959 : గ్రామీ అవార్డు బహూకరణ ప్రారంభం
1957: భారత చరిత్రకారుడు హేమచంద్ర రాయచౌదరి మరణం
1924: పారిస్లో 8 వ ఒలింపిక్ క్రీడలు ప్రారంభం
1922: “షార్క్ లేడీ” గా పిలిచే అమెరికన్ సముద్ర జీవశాస్త్రవేత్త యూజీని క్లార్క్ జననం
1902: కర్ణాటక మొదటి ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ గవర్నర్ కేసీ రెడ్డి జననం
1896: లండన్ డైలీ మెయిల్ మొదటి ఎడిషన్ ప్రచురణ ప్రారంభం
1799: మైసూర్ రాజ్య పాలకుడు టిప్పు సుల్తాన్ మరణం
1767: ప్రఖ్యాత కవి, సంగీతకారుడు త్యాగరాజు జననం
భారత్కు వినోద్ ఖోస్లా 10 మిలియన్ డాలర్ల సాయం
పంచాయతీ విజయం చూడకముందే ముగ్గుర్ని కాటేసిన కరోనా
లాక్డౌన్ విధించండి.. క్యాట్ సర్వేలో ప్రజలు
ఈ నెల 10 న విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్న కేపీ ఒలి
గ్లేసియర్స్ కరిగి ఏర్పడిన వేలాది సరస్సులు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఆన్లైన్లో 60 మంది వైద్యులు.. వివిధ భాషల్లో సేవలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..