కరోనా కష్టకాలంలో చిరంజీవి తన సేవా కార్యక్రమాలతో అందరి మనసులు గెలుచుకుంటున్నారు. కష్టాలలో ఉన్న వారి సమస్యలపై వెంటనే స్పందిస్తూ వస్తున్న చిరు ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామలాకు లక్షా పదిహేను వేలు సాయం అందించడంతో పాటు ఆమెకు మాలో సభ్యత్వం ఇప్పించి పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేశారు. ఇక తాజగా కారవ్యాన్ డ్రైవర్ కిలారి జయరామ్ కరోనాతో కన్నుమూయగా, అతని కుటుంబానికి రూ. లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. జయరామ్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు, సంతోషం సురేష్ కొండేటి.. జయరామ్ కుటుంబాన్ని కలిసి చిరు పంపిన చెక్ను అందించారు.ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేసిన జయరామ్ భార్య శోభారాణి.. చిరంజీవి గారు ఆపద వచ్చినప్పుడల్లా మమ్మల్ని ఆదుకున్నారు. గతంలో నా భర్త బైక్పై వెళుతూ యాక్సిడెంట్కు గురైతే వెంటనే ఉపాసనకు కాల్ చేసి వైద్య సాయం అందించారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు మాకు లేకుండా ఆదుకున్నారు. ఇప్పుడు మరోసారి మాకు అండగా నిలవడం ఆనందంగా ఉంది. చిరంజీవి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని శోభారాణి పేర్కొంది.