హైదరాబాద్ : హైదరాబాద్ విశ్వవిద్యాలయం పరిశోధకుల బృందం మలేరియాను అరికట్టడానికి ఓ సరికొత్త లింక్ను డీకోడ్ చేసింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మృణాల్ కంటి భట్టాచార్య నేతృత్వంలోని పరిశోధకుల బృందం మలేరియా వల్ల కలిగే జ్వరం, మలేరియా పరాన్నజీవుల యొక్క యాంటిజెనిక్ వైవిద్యానికి మధ్య సంబంధం ఉన్నట్లు కనుగొన్నారు. ఈ పరిశోధన మలేరియాలో నివారణలో అత్యంత కీలకం కానుందని పరిశోధకులు తెలిపారు. మలేరియా వ్యాధిపై పరిశోధకుల అభిప్రాయం ప్రకారం 2019 సంవత్సరం నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 229 మిలియన్ మలేరియా కేసులను అంచనా వేయగా, అందులో 4,09,000 మరణాలు నమోదయ్యాయి.
ప్రస్తుతం జరిపిన పరిశోధనలో మలేరియా వచ్చినప్పుడు ఎర్ర రక్త కణాల ఉపరితలంపై మలేరియా ప్రోటీన్ల వ్య క్తీకరణను పరాన్న జీవులు ఎలా ప్రభావం చూపుతాయో తాజా అధ్యయనంలో కనుగొన్నారు. మలేరియాలో అత్యంత ప్రమాదకరమైన ప్లాస్మోడియం ఫాల్పిపరం ఎరిథ్రోసైట్-మెమ్బ్రేన్ ప్రోటీన్ 1(పీఎఫ్ఇఎంపీ1)పరాన్న జీవి అని ప్రస్తుత అధ్యయనంలో గుర్తించారు. ఈ ప్రోటీన్లో 90 రకాల వైవిధ్యా లు ఉండవచ్చన్నారు. మలేరియా పరాన్న జీవులు ఒక ప్రోటీన్ రూపం నుంచి మరోదానికి మారుతూ ఉండడంతో ఈ ప్రోటీ న్లు బహుళ తరాల వరకు జీవించవు, అందువల్ల ఈ వేరియంట్ల ప్రోటీన్లకు వ్యతిరేకంగా బలమైన యాంటిబాడీ ప్రతి స్పందనను అమర్చడంలో మనిషి శరీరం విఫలమవుతుందని పరిశోధకులు శనివారం వెల్లడించిన నివేదికలో తెలిపారు.