కలుపు నివారణకు దోహదం..
తప్పనున్న చీడపీడల బెడద
భూమిలో ఇంకనున్న వర్షపు నీరు
వనపర్తి రూరల్, మే 18 : వేసవిలో చదును చేసుకునే పొలం పనులను బట్టే పంటల పెరుగుదల, దిగుబడులు వస్తాయి. ఇటీవల ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో వానలు కురిశాయి. దుక్కులు దున్నడానికి సరిపడా తేమ ఉండడంతో రైతులు దుక్కులు దున్నారు. వాలుకు అడ్డంగా సుమారుగా 9 అంగుళాలకు లోతు తగ్గకుండా దున్నుకోవాలి. వర్షం తక్కువగా కురిసినా వాలుకు అడ్డంగా దున్నుకోవడం వల్ల వర్షపు నీరు భూమిలో బాగా ఇంకిపోయి పంటలకు మేలు చేకూరుతుంది.
వేసవి దుక్కులతో పంటలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా మంది రైతులు యాసంగి పంటలు కోయగా నే పొలాన్ని అలాగే వదిలేస్తారు. మళ్లీ తొలకరి పలకరించగానే వానకాలం సాగుకు సిద్ధమవుతుంటా రు. చినుకులు కురవగానే దుక్కులు దున్నడం మొ దలుపెడతారు. అలాకాకుండా వేసవిలోనే దుక్కు లు దున్నడంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. భూమి ఎం డకు బాగా వేడెక్కడంతో లోపలి క్రిములు నశించిపోతాయి. పంటలు వేసినప్పడు క్రిమికీటకాల బెడ ద ఉండదు. మందులు పిచికారీ చేయాల్సిన అవసరం ఉండదని అధికారులు సూచిస్తున్నారు. వేసవిలో దుక్కి దున్నకుండా వదిలేస్తే కలుపు మొక్కలు బాగా పెరుగుతాయి. అవి భూమిలో నీటిని, పోషక పదార్థాలను గ్రహిస్తాయి దీంతో భూమి లోపలి పొరల నుంచి కూడా నీరు ఆవిరవుతుంది. దీంతో భూసారం తగ్గుతుంది. పంటలకు పోషక పదార్థాలు అందకుండా పోతాయి. ఆశించిన స్థాయిలో దిగుబడులు రావు. ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసే అకాల వర్షాలను ఉపయోగించుకొని భూమిని 25 నుంచి 30 సెంటీమీటర్ల లోతులో దుక్కి దున్నుకుంటే మంచి ఫలితాలు ఆశించొచ్చు. దుక్కుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రెక్కనాగలి లేదా పల్లపు నాగలిని ఉపయోగించాలి. ఇవి నేలను పాయలుగా కోసి మట్టిని తిరగేస్తాయి. మెట్ట సేద్యానికి ఆరు అంగుళాల రెక్క నాగలి బాగా పనికివస్తుంది. తేమ ఎక్కువగా ఉండే గట్టి భూముల్లో పల్లపు నాగలిని ఉపయోగించాలి. భూమిలో గతంలో వేసిన పంట అవశేషాలు ఎక్కువగా ఉంటే పల్లపు నాగలి బాగా దున్నుతుంది. దీంతో పల్లాలు గుండ్రంగా తిరుగుతూ భూమి లోపలి పొరల్లో దిగబడతాయి. ఎంత లోతుకు వెళ్తాయన్నది.. పల్లాల బరువుపై ఆధారపడి ఉంటుంది.
పొలాల్లో చెత్త, ఆకులు కాల్చొద్దు..
కొల్లాపూర్, మే 18 : పంట పొలాల్లో ఉండే చెత్త, ఆకులను కాల్చకుండా భూమిలో మురిగిపోయేలా చేస్తే నేలకు సారం లభిస్తుందని మండల వ్యవసాయాధికారి నాగరాజు తెలిపారు. కాల్చడం వల్ల బూడిదగా మారి పొలానికి సారం ఇవ్వకుండా వర్షాలకు కొట్టుకుపోయి వృథా అవుతుందన్నారు. ఒకరిని చూసి మరొకరు పొలాల్లో చెత్తలకు నిప్పుపెడుతూనే.. మరో పక్క ట్రాక్టర్తో వేసవి దుక్కులు దున్నడంలో రైతాంగం బిజీబిజీగా ఉన్నారన్నారు. మండలంలో కొందరు ముందస్తుగానే తమ పంట పొలాల్లో ఎరువుల కుప్పలను నిల్వ చేసుకున్నారని చెప్పారు.
అధిక దిగుబడికి అవకాశం..
అయిజ, మే 18 : వేసవిలో దుక్కులు దున్న డం వల్ల అధిక దిగుబడికి అవకాశం ఏర్పడుతుం ది. ఇటీవల కురిసిన వర్షాలకు దుక్కులు దున్నడానికి సరిపడా తేమ ఉండడంతో రైతులు బిజీబిజీగా ఉన్నారు. దుక్కుల లోతు సుమారుగా 9 అంగుళాలకు తగ్గకుండా ఉండేలా చూసుకోవా లి. వాలుకు అడ్డంగా దున్నితే వర్షపు నీరు భూ మిలో బాగా ఇంకుతుంది. ఏడాది పొడవునా ని ల్వ చేసిన పశువుల ఎరువులను ఎండాకాలంలో నే పొలాల్లో వేయాలి. వానలు పడిన తర్వాత పొలాల్లో వేసిన ఎరువులను నేలపై చల్లి లోతు దుక్కి దున్నితే మట్టిలో బాగా కలుస్తుంది. వేసవి లో లోతు దుక్కులు దున్నినప్పుడు పొలంలో కలుపు, గత పంటల అవశేషాలు లేకుండా నేల ను శుభ్రం చేస్తుంది. దీంతో తొలకరి వానలకు నేలలో గొర్రు తిప్పి ఆలస్యం కాకుండా సకాలం లో విత్తనాలు విత్తుకోవడానికి వీలు కలుగుతుం ది. వేసవిలో తొలకరి వానలు కురవగానే దు క్కులు దున్నుకోవడం ప్రారంభించాలని ఏవో శంకర్లాల్ తెలిపారు. తొలకరిలో కురిసే వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోయి పొలం తడిగా మా రే అవకాశం ఉంటుందన్నారు.
అన్ని విధాలుగా మేలు..
భూమిని 25-30 సెంటీమీటర్ల లోతు వరకు దుక్కులు దున్నడంతో నేలలో గాలి లభ్యత పెరిగి సూక్ష్మజీవుల సాంద్రత పెరుగుతుంది. కర్భన పదార్థం లభ్యత పెరిగి నేల సారవంతమవుతుంది. భూమికి వాలుగా దుక్కి దున్నడంతో వర్షం పడినప్పడు ఆ నీరు పడ్డది పడ్డట్టుగా నేల లోపల ఇంకుతుంది. భూమికి నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం పెరుగుతుంది. వాతావరణంలోని నత్రజని వర్షపు నీటితో కలిసి నేలలో చేరడంతో సారవంతంగా మారుతుంది. – కురుమయ్య, వ్యవసాయ అధికారి, వనపర్తి