న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో కాంస్య పతకం నెగ్గిన రెజ్లర్ బజరంగ్ పూనియాపై ( Bajrang Punia ) హర్యానా సర్కారు వరాల జల్లు కురిపించింది. బజరంగ్ పూనియాకు రూ.2.5 కోట్ల నగదుతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ ప్రకటించారు. రెజ్లింగ్ సెమీస్లో ఓడిన భజరంగ్ పూనియా ఇవాళ కాంస్యం కోసం జరిగిన పోరులో కజిక్స్థాన్ దౌలత్ నియజ్బెకోవ్ పై విజయం సాధించి పతకం నెగ్గాడు.
దాంతో ఇప్పటివరకు ఒలింపిక్స్లో పతకం సాధించిన ఆరో రెజ్లర్గా భజరంగ్ నిలిచాడు. అదేవిధంగా బజరంగ్ కాంస్య పతకంతో కలిపి భారత్కు ఒలింపిక్స్లో ఇప్పటివరకు ఏడు పతకాలు వచ్చాయి. బజరంగ్ విజయంపై హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ ట్విట్టర్ ద్వారా కూడా స్పందించారు. బజరంగ్ కేవలం ఒలింపిక్స్ పతకం మాత్రమే గెలువలేదని, దేశంలోని ప్రజలందరి హృదయాలను గెలుచుకున్నాడని ఖట్టర్ ప్రశంశించారు.