నిజామాబాద్ : కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగు మీదుగా మంజీరా నది ద్వారా తరలివస్తున్న కాలేశ్వరం జలాలకు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంజీరా నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని గోలి లింగాల వద్ద కాళేశ్వరం జలాలకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. చీర, సారె, పసుపుకుంకుమలతో గోదావరి జలాలకు పూజలు చేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. ఏండ్లుగా నీళ్లు లేక బోసిపోతున్నా నిజాంసాగర్ ప్రాజెక్టు కు ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుత ఆలోచనతో మహర్ధశ పట్టిందన్నారు. కాళేశ్వరం జలాలతో నింపడం ద్వారా నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు కొండంత ధైర్యం దక్కుతుందని అన్నారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు కు పూర్వవైభవం తీసుకురావాలని నా సంకల్పం. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మూలంగా నెరవేరిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాలేశ్వరం నీళ్లు నేరుగా నిజాంసాగర్ కు రావడం చేత రైతుల బాధలు అన్నీ పోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
మంత్రి వేముల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సంకల్పసిద్ధి మూలంగానే నిజాంసాగర్కు పునరుజ్జీవం సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. కలలో కూడా ఊహించని విధంగా గోదావరి జలాలను ఏకంగా కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగు మీదుగా ప్రత్యేక కాల్వలు తవ్వించి జలాలను పంపడం అద్భుతం అని కొనియాడారు.
దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఊపిరి పోసినట్లు అయ్యిందని సంతోషమని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు జాజుల సురేందర్, హనుమంత్ షిండే, కామారెడ్డి కలెక్టర్ శరత్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా పరీక్షల కోసం వచ్చి.. కన్నుమూశాడు
సీఎం కేసీఆర్ గొప్ప దైవభక్తుడు : మంత్రి కొప్పుల
నేల తల్లి బాగుంటేనే భవిష్యత్తు : మంత్రి ఐకే రెడ్డి
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
ఒకే దేశంలో వ్యాక్సిన్కు రెండు ధరలా?