మంత్రి గోయల్కు ట్విట్టర్లో కేటీఆర్ ప్రశ్న
హైదరాబాద్/సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని కేంద్ర రైల్వేమంత్రి పియూష్ గోయల్ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే 150 ఎకరాల భూమిని అప్పజెప్పిందని సోమవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి గోయల్.. మహారాష్ట్రలోని లాథూర్లో మరాఠ్వాడా రైల్కోచ్ ఫ్యాక్టరీని 350 ఎకరాల్లో రూ.625 కోట్లతో నిర్మించగా.. ప్రతిఏటా 250 కోచ్లు తయారవుతున్నాయని, ఇది ఆ ప్రాంతంలో గేమ్చేంజర్గా మారుతున్నదని పేర్కొన్నారు. దీనికి స్పందనగా మంత్రి కేటీఆర్.. వరంగల్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ పేరుతో యాష్ ట్యాగ్ జోడించి చురక అంటించారు.