ముంబై : ఓ నిండు గర్భిణి ప్రాణాలను రైల్వే కానిస్టేబుల్ కాపాడి ప్రశంసలు అందుకుంటున్నారు. ముంబైలోని కల్యాణ్ రైల్వే స్టేషన్లో కదులుతున్న రైల్లో నుంచి నిండు గర్భిణి కిందకు దిగేందుకు ప్రయత్నిస్తుండగా.. అక్కడే ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ అప్రమత్తమయ్యాడు. తక్షణమే ఆమె చేయి పట్టుకుని ప్లాట్ ఫాంపైకి లాగాడు.
ఒక వేళ కానిస్టేబుల్ అప్రమత్తం కాకపోతే ఆ గర్భిణి రైలు పట్టాలకు, ప్లాట్ ఫాం మధ్యలో పడిపోయే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉండేది. కానీ కానిస్టేబుల్ ఆమె ప్రాణాలను కాపాడాడు. గర్భిణి వెంట ఉన్న ఓ వ్యక్తి కూడా ఆ రైల్లో నుంచి కిందకు దూకాడు. అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. గర్భిణిని ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్పై రైల్వే ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు.