ముంబై: రైలు ప్లాట్ఫామ్ మీది నుంచి బయల్దేరింది. అప్పుడే వేగం పుంజుకుంటుంది. ఆ రైలును ఎక్కేందుకు ఓ ప్రయత్నించాడు. అయితే రైలు అతనికంటే స్పీడ్ వెళ్తుండటంతో పట్టుతప్పి పడిపోయాడు. ఈ క్రమంలో అతడు బోగీకి, ప్లాట్ఫామ్కి మధ్యలో పడిపోతుండగా.. ఇదంతా గమనిస్తున్న రైల్వే కానిస్టేబుల్ అతన్ని పక్కకి గుంజేశాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ ఫుటేజీని రైల్వే మంత్రిత్వశాఖ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని బోరివల్లి రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది.
దాదర్-భుజ్ ప్రత్యేక రైలు బోరివల్లి స్టేషన్ నుంచి బయల్దేరింది. ఆ రైలును ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి పట్టుతప్పి కిందపడిపోయాడు. అక్కడే ఉన్న కుమార్ అనే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అతన్ని పక్కకు లాగేశాడు. కాగా, కదులుతున్న రైలును ఎక్కడం కానీ, అందులో నుంచి దిగడానికి కానీ ప్రయత్నించవద్దని రైల్వేశాఖ ప్రయాణికులను హెచ్చిరించింది. వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్ కుమార్ను అభినందించింది.