పరకాల ఏసీపీ పీ శ్రీనివాస్
పరకాల, జూన్ 7: లాక్డౌన్ సమయంలో వాహనదారులు, ప్రజలు రోడ్డుపైకి రావొద్దని పరకాల ఏసీపీ పీ శ్రీనివాస్ కోరారు. సోమవారం పట్టణంలోని బస్టాండ్ సర్కిల్లో లాక్డౌన్ను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రోడ్డుపైకి వచ్చిన వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఏసీపీ మాట్లాడుతూ రెండో దశ కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను విధించిందన్నారు. ప్రజలు ఇందుకు సహకరించి నిబంధనలు పాటించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనదారులు వస్తే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. లాక్డౌన్ సడలింపు సమయంలో ప్రజలు గుంపులుగా తిరుగొద్దని, మాస్కులు ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మహేందర్ రెడ్డి, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నర్సంపేటలో..
నర్సంపేట : నర్సంపేటలో సోమవారం లాక్డౌన్ను పోలీసు అధికారులు పర్యవేక్షించారు. సడలింపు వేళల్లో ఉదయం 6 నుంచి ఒంటి గంట వరకు ప్రజలు నిత్యావసర సరుకుల కోసం దుకాణాల వద్దకు వస్తున్నారు. అనంతరం దుకాణదారులు షాపులు మూసివేస్తున్నారు. పోలీసులు కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వస్తున్నారు. నర్సంపేట ఏసీపీ ఫణీందర్, డీఎస్పీ కరుణసాగర్రెడ్డి, ఎస్సై నవీన్కుమార్, ట్రైనీ ఎస్సైలు, కానిస్టేబుల్స్ లాక్డౌన్ను పర్యవేక్షిస్తూ అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు జరిమానాలు విధించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ప లువురిపై కేసులు నమోదు చేశారు.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట : మండల కేంద్రలోని నర్సంపేట-నెక్కొం డ ప్రధాన రహదారిపై ఎస్సై శీలం రవి లాక్డౌన్ను పర్యవేక్షించారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన 15 మంది వాహనదారులకు రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అనుమతి లేకుండా తిరుగుతున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో కరోనా కేసుల పెరుగుతున్నందున స్వీయనియంత్రణ పాటించాలన్నారు. లాక్డౌన్ సమయంలో రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు తిరుపతి, ఉపేందర్, రామకృష్ణ, క్రాంతికుమార్, రాము పాల్గొన్నారు.