న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ విధానాన్ని వ్యాపారవేత్త, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ప్రశ్నించారు. వ్యాక్సిన్లను ప్రజలకు ఉచితంగా ఇస్తుండగా ప్రైవేట్ దవాఖానలను అదనపు చార్జీలు వసూలు చేసేందుకు ఎందుకు అనుమతిస్తున్నారని రాబర్ట్ వాద్రా నిలదీశారు. ఏ వ్యాక్సినేషన్ కేంద్రంలో ఉచిత వ్యాక్సిన్లు ఇస్తున్నారనే విషయం ప్రజలకు తెలియడం లేదని అన్నారు.
వ్యాక్సిన్లు వాటి కాంప్లికేషన్లపై ప్రజలకు ఎలాంటి సమాచారం అందచేయడం లేదని ఆరోపించారు. ఇక ప్రభుత్వం హెడ్ లైన్స్ కే ప్రాధాన్యం ఇస్తోందని డెడ్ లైన్లను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఉచిత వ్యాక్సినేషన్ ను ప్రకటించడంలో తీవ్ర జాప్యం చేసిందని అంతకుముందు కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల నేతలు మోదీ సర్కార్ ను దుయ్యబట్టారు.