న్యూఢిల్లీ, ఆగస్టు 4: తూర్పు లఢక్లో 19,300 అడుగుల ఎత్తులో ఉమ్లింగ్లా కనుమ వద్ద బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) రోడ్డును నిర్మించింది. దీని పొడవు 52 కిలోమీటర్లు. ఎవరెస్టు పర్వతం బేస్ క్యాంపు కంటే ఎత్తైన ప్రదేశంలో ఈ రోడ్డును నిర్మించారు. ‘ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన రోడ్డు ఇది’ అని కేంద్రప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు ఈ రికార్డు బొలివియాలోని యుటారాంకూ అగ్నిపర్వతాన్ని కలుపుతూ నిర్మించిన రోడ్డు(18,953 అడుగులు) పేరిట ఉన్నది.