పాట్నా: రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా తొమ్మిదేండ్ల అనంతరం తిరిగి బీహార్ సీఎం నితీశ్ కుమార్ చెంతకే చేరారు. తన పార్టీని అధికార జేడీయూలో విలీనం చేశారు. ఆ వెంటనే కుష్వాహాను జాతీయ పార్లమెంటరీ బోర్డు అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు నితీశ్ ప్రకటించారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు 2007లో జేడీయూ నుంచి కుష్వాహా బహిష్కరణకు గురయ్యారు. రెండేండ్ల తర్వాత ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. అయితే 2013లో ఆయన జేడీయూ నుంచి బయటికొచ్చి ఆర్ఎల్ఎస్పీ ఏర్పాటు చేశారు.