హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్కు మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. బుధవారం నిర్వహించిన యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు మిశ్రమంగా వచ్చినట్లు తెలిపారు. నిన్నటి యాంటిజెన్ టెస్ట్ రిపోర్ట్లో ఫలితం నెగెటివ్గా వచ్చిన విషయం తెలిసిందే.
కాగా ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్ట్లో కచ్చితమైన ఫలితం రాలేదని ఎంవీ రావు తెలిపారు. వైరస్ తగ్గు ముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి కచ్చితమైన ఫలితాలు రావని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారన్నారు. రెండు మూడు రోజుల్లో మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు.
సీఎం కేసీఆర్కు స్వల్పంగా కొవిడ్ లక్షణాలు ఉండటంతో యాంటిజెన్ పరీక్షలు చేయగా పాజిటివ్గా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఐసోలేషన్లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించడంతో వ్యవసాయక్షేత్రంలోనే సీఎం విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యుల బృందం సీఎం ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుంది.