పాట్నా: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలపై ఈ నెల 18, 19 తేదీల్లో ఆర్జేడీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేత, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన తేజశ్వి యాదవ్ తెలిపారు. జూలై 18న రాష్ట్రంలోని అన్ని బ్లాక్ల వద్ద, 19న అన్ని జిల్లాల ప్రధాన కార్యాలయాల వద్ద నిరసన తెలుపుతామని చెప్పారు. ఇందులో పాల్గోవాలని కోరుతూ మహాకూటమిలోని పార్టీలకు లేఖ రాస్తామని తేజశ్వి యాదవ్ తెలిపారు. బీహార్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ-బీజేపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ఆర్జేడీ సిద్ధమైంది.