షో చేయడానికే ఆల్పార్టీ మీటింగ్.. కేంద్రంపై తేజస్వి ఫైర్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై బీహార్కు చెందిన యువ నాయకుడు, ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కరోనా మహమ్మారి పరిస్థితిపై సమీక్ష చేయడం కోసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసిన కేంద్రం.. ఆ మీటింగ్కు తమ పార్టీని ఆహ్వానించకపోవడంపై మండిపడ్డారు.
బీహార్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన ఆర్జేడీని అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించకపోవడం కేంద్ర ప్రభుత్వ పక్షపాతపూరిత వైఖరికి నిదర్శనమని తేజస్వి యాదవ్ విమర్శించారు. నచ్చిన వాళ్లని పిలుచుకుని, తూతూమంత్రంగా ముగించిన ఈ సమావేశం.. కరోనా నిర్మూలన కోసం చిత్తశుద్ధితో నిర్వహించిన సమావేశంలా లేదని, ఏదో షో చేయడం కోసం నిర్వహించిన సమావేశంలా ఉందని ఆయన ఆరోపించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- 2021లో బైజూస్ కు మార్కెట్ ఎలా ఉందంటే..?
- ఫిలిప్పీన్స్లో భూకంపం:రిక్టర్ స్కేల్పై 7.0గా నమోదు
- హీరో@10 కోట్ల క్లబ్
- పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ మొఘల్ ‘వాటర్ ట్యాంక్’
- కపోతం చిహ్నంతో లేడీ గగా శాంతి సందేశం
- పది లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు: కేంద్రం
- చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి నిధులు విడుదల
- ఎస్ఎస్వై అడిషనల్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ అరెస్ట్
- టేకు విత్తనాలు చల్లుతున్నపద్మశ్రీ అవార్డు గ్రహీత...!
- మహారాష్ట్రలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు