న్యూఢిల్లీ: ఇటీవల కరోనా మహమ్మారి బారినపడ్డ భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ కురు వృద్ధుడు మన్మోహన్సింగ్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్సింగ్ సుర్జేవాలా ప్రకటించారు.
ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, జ్వరం తగ్గిపోయిందని సుర్జేవాలా చెప్పారు. మన్మోహన్ సింగ్కు స్వల్పంగా జ్వరం రావడంతో ఈ నెల 19న ప్రీమియర్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను ఎయిమ్స్లో చేర్చారు. కాగా, మన్మోహన్సింగ్ మార్చి 4, ఏప్రిల్ 3 తేదీల్లో రెండు డోసులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
భారత్ భయంకరమైన స్థితిలో ఉన్నది: ఆంథోనీ ఫౌసీ
ఉత్తరాఖండ్లో హిమపాతం.. ఎనిమిది మంది దుర్మరణం
ఎస్ఐని హతమార్చిన మావోయిస్టులు
కరోనా విధుల్లో కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్లోనే హల్దీ వేడుక
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
కరోనా కల్లోలం: పేద ప్రజలకు కేంద్రం తీపి కబురు..