మహబూబ్నగర్, మే 18 (నమస్తే తెలంగాణ ప్రతిని ధి) : కరోనాతో ప్రపంచమంతా గడగడలాడుతున్నది. కు టుంబాలకు కుటుంబాలే వైరస్ బారిన పడి తీవ్రంగా ఇ బ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం లాక్డౌన్ పెట్టి ప్రజ ల ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నది. గతేడాది వచ్చిన కరోనా మొదటి దశతో పోలిస్తే ప్రస్తుతం వస్తోన్న వైరస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటున్నది. గతేడాది వైరస్ సోకినా స్వల్ప లక్షణాలతో ఎక్కువ మంది త్వరగా కోలుకున్నారు. రెండో దశ కరోనా వ్యాప్తిలో వైరస్ మ్యూ టెంట్లు భిన్నంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వైరస్ ఎ ప్పుడు ఎలా ప్రభావం చూపుతుందో వైద్యులకు అర్థం కాని విధంగా మారింది. బాధితుల్లో అవయవాలు దెబ్బతింటున్నాయి. వైరస్ సోకిన కొన్ని రోజుల్లోనే ప్రాణాలను హరిస్తోంది. మొదటి దశలో ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ పరీక్షల ద్వారా ఈ వైరస్ను త్వరగానే గుర్తించే వీలుండేది. ఇప్పు డు ఈ రెండు టెస్టుల్లో నెగెటివ్ వస్తూ జనాన్ని ఆందోళన కు గురి చేస్తోంది.
సీటీ స్కాన్ చేస్తే పాజిటివ్గా తేలుతున్నది. అందుకే అంతా స్కానింగ్ సెంటర్ల వైపు పరుగులు పెడుతున్నారు. ఇదే అదనుగా భావించిన నిర్వాహకులు రూ.5 నుంచి రూ.6 వేల వరకు సీటీ స్కాన్కు ఛార్జి చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా స్కానింగ్ చేస్తు న్నా.. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లిన రోగులకు మాత్రం భా రంగా మారుతున్నది. ఈ తరుణంలో సిద్దిపేట, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తరహాలో మహబూబ్నగర్లోనూ సీటీ స్కానింగ్ ధరలు తగ్గించేందుకు మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ చొరవ తీసుకున్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకులు, డీఎంహెచ్వోతో సమావేశమయ్యారు. పాలమూరులో రూ.1999కే సీటీ స్కానింగ్ ప రీక్షలు చేయాలని సూచించారు. మంత్రి ప్రతిపాదనకు స్కానింగ్ సెంటర్ల నిర్వహకులు అంగీకరించడంతో పేదలపై భారం తగ్గింది.
మంత్రి శ్రీనివాస్గౌడ్ చొరవతోనే..
కొవిడ్ నిర్ధారణ కోసం చేసే సీటీ స్కాన్ పరీక్షలకు మ హబూబ్నగర్ జిల్లాలో రూ.5 నుంచి రూ.6వేల వరకు వసూలు చేస్తున్నారని తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్గౌ డ్ సోమవారం అడిషనల్ కలెక్టర్ నందలాల్ పవార్, డీ ఎంహెచ్వో కృష్ణ, డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం ఉన్న కష్టకాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా సీటీ స్కాన్ పరీక్షలు చేయాలని మంత్రి స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులను కోరారు. మం త్రి సూచన మేరకు సీటీ స్కానింగ్ రూ.1999కే చేసేందుకు నిర్వాహకులు అంగీకరించారు. స్కానింగ్ కాపీ కా వాలంటే వాట్సాప్ చేయనున్నారు. సీటీ స్కానింగ్ చేసిన ఫిల్మ్ కావాలంటే రూ.2,790 చెల్లించాల్సి ఉంటుంది. సోమవారం నుంచే ఈ ధరలు అందుబాటులోకి వచ్చా యి. ఈ మేరకు డీఎంహెచ్వో జిల్లాలో హెచ్ఆర్సీటీ చేసే ఆరు స్కానింగ్ సెంటర్లకు ఆదేశాలు పంపించారు. అన్ని ప్రైవేట్ కేంద్రాల్లో ఇకపై తగ్గించిన ధరలకే సీటీ స్కానింగ్ తీయాల్సి ఉంటుంది. ఎవరైనా అధికంగా వసూలు చేస్తే సీజ్ చేయాలని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయించింది. మంత్రి శ్రీనివాస్గౌడ్ చొరవ తీసుకుని రాష్ట్రంలో అతి తక్కువ ధరకు సీటీ స్కానింగ్ చేసేలా స్కానింగ్ సెంటర్లను ఒప్పించారు.
నిరంతరం నిఘా..
స్కానింగ్ సెంటర్లలో ధరలు తగ్గించినట్లే తగ్గించి పెం చే అవకాశం ఉండటంతో మంత్రి శ్రీనివాస్గౌడ్ దీనిపై నిరంతరం నిఘా ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. కొవిడ్పై డీఎంహెచ్వో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న టాస్క్ఫోర్స్ బృందం ధరలపై నిరంతరం నిఘా ఉంచనున్నది. ఎవరైనా ఎక్కువ ఛార్జి వసూలు చేస్తే ఆ స్కా నింగ్ సెంటర్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అలాగే అవసరం లేకున్నా సీటీ స్కాన్ రాసే వైద్యులపైనా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉన్నది.
మానవత్వం చూపాలి..
ప్రైవేట్ సెంటర్లలో సీటీ స్కాన్ ధరలు చుక్కలంటుతున్నాయి. కొందరు వైద్యులు స్కానింగ్ సెంటర్ల నుంచి రెఫరల్ ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో స్కానింగ్ సెంటర్ల నిర్వాహకు లు ఒక్కొక్కరి నుంచి రూ.5 వేలకు పైగా ఫీ జు వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పేదవారిపై తీవ్ర ప్రభావం పడుతున్నది. అందుకే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులను పిలిపించుకుని మాట్లాడి ధరలు తగ్గించాం. రూ.1999కే సీటీ స్కాన్ చేసేందుకు అందరూ అంగీకరించా రు. ఫిల్మ్తో కావాలంటే రూ.2,790 చెల్లించాలి. అంతకంటే ఒక్క పైసా ఎక్కువ వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. దీనిపై రోగులు తమకు ఫిర్యాదు చేయొచ్చు. ప్రపంచమంతా చిగురుటాకులా వణుకుతున్న ఈ కష్టకాలంలో భారం మోపడం భావ్యం కాదు. డాక్టర్లు కూడా రెఫరల్ ఫీజులను ఆశించకూడదు. అందరూ మానవత్వం ప్రదర్శించాలి.