అపోహల్ని తొలగించేందుకు అస్సాం ప్రభుత్వం చర్య
గువాహటి: అస్సాం ప్రభుత్వం బుధవారం 2,479 ఖడ్గ మృగాల కొమ్ములను కాల్చివేసింది. ఆరు చోట్ల ప్రత్యేకంగా కొలిమిలను ఏర్పాటు చేసి ప్రజలందరూ చూస్తుండగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. బుధవారం ప్రపంచ ఖడ్గమృగాల రోజును పురస్కరించుకొని ఈ చర్యకు పూనుకొన్నది. ఖడ్గమృగాల కొమ్ముల్లో ఔషధ గుణాలు ఉంటాయన్న నమ్మకంతో ప్రజలు వాటిని వేటాడుతున్నారు. ఫలితంగా ఖడ్గమృగాల సంఖ్య తగ్గిపోతున్నది. ఈ నేపథ్యం లో ప్రజల్లో ఉన్న అపోహలను పోగొట్టి, ఖడ్గమృగాలను సంరక్షించేందుకు ప్రభుత్వం ఈ కొమ్ములను కాల్చివేసింది. గతంలో వీటిని స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకుంది.