వేదికలతో వ్యవసాయ చైతన్యం
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
గొల్లపల్లిలో రైతు వేదిక ప్రారంభం
119 మందికి 1.19కోట్ల చెక్కుల పంపిణీ
గొల్లపల్లి, ఏప్రిల్ 1: తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం గొల్లపల్లి మండలంలో రైతు వేదికతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను జడ్పీ చైర్పర్సన్ వసంత, కలెక్టర్ రవితో కలిసి ప్రారంభించా రు. గొల్లపల్లిలో 119 మందికి కోటి 19 లక్షల 13 వేల 804 విలువైన షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను అందించా రు. గొల్లపల్లిలో 22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక, 2.75 లక్షలతో నిర్మించిన ముదిరాజ్ సంఘ భవనం, 3.68 లక్షలతో నిర్మించిన గౌడ సంఘ భవనాన్ని ప్రారంభించారు. ఒక్కొక్కటి 4.60 లక్షలతో చేపట్టిన రెండు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి మాట్లాడుతూ రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా ప్రభు త్వం పనిచేస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం సర్కారు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నదని స్పష్టం చేశారు. రైతు వేదికల నిర్మాణంతో రైతుల్లో వ్యవసాయ చైతన్యం వస్తుందని అభిప్రాయపడ్డారు. రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు వేదికలు ఉపయోగపడతాయని, వ్యవసాయ విస్తరణాధికారితో పాటు ఆర్బీఎస్ అధ్యక్షుడు అందుబాటులో ఉంటారని తెలిపారు. పల్లెప్రగతి కార్యక్రమానికి కేంద్రం కూడా అవార్డులు ఇచ్చి ప్రశంసించిందని గుర్తుచేశారు. అభివృద్ధిని ఓర్వలేక కొందరు విమర్శలు చేస్తు న్నారని, వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించా రు.
పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వం కల్యాణలక్ష్మి ద్వారా భరోసా ఇస్తుందని చెప్పారు. కలెక్టర్ రవి మాట్లాడుతూ జిల్లాలో 5000 ఎకరాలకు ఒక రైతు వేదిక చొప్పున 71 రైతు వేదికల నిర్మాణం పూర్తయిందని వివరించా రు. 380 వైకుంఠధామాలకుగాను 360 పూర్తయ్యాయని, డంపింగ్ యార్డులు సైతం వందశాతం కంప్లీట్ అయినట్లు పే ర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కలెక్టర్ రవి, ఎంపీపీ శంకరయ్య, జడ్పీటీసీ జలంధర్, సర్పంచ్ నిషాంత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ లింగా రెడ్డి, ప్యాక్స్ అధ్యక్షుడు రాజసుమన్ రావు, మాధవ రావు, రైతు బంధు సమితి అధ్యక్షుడు కిష్టా రెడ్డి, వైస్ ఎంపీపీ సత్తయ్య, తహసీల్దార్ నవీన్ కుమార్, ఆర్బీఎస్ జిల్లా కమిటీ సభ్యులు హన్మాండ్లు, అశోక్రావు, సర్పంచ్ల ఫోరం జిల్లా, మండలాధ్యక్షులు గంగారెడ్డి, రమేశ్, మండలాధ్యక్షుడు రమేశ్, పార్టీ అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి బాబు, యూత్ అధ్యక్షుడు రవీందర్, ఉప సర్పంచ్ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చుడండి
రోజూ పరగడుపునే కొబ్బరి నీళ్లను తాగితే..?
పొద్దు తిరుగుడు విత్తనాలను రోజూ తింటే..?