ఆ తర్వాత కరోనా కేసుల్లో తగ్గుదల
మే చివరికి బాగా తగ్గనున్న మహమ్మారి
కరోనా రెండో దశపై నిపుణుల అంచనా
బరేలీ, ఏప్రిల్ 2: దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా రెండో దశ ఏప్రిల్ మధ్య నాటికి గరిష్ఠస్థాయికి చేరవచ్చని నిపుణులు అంచనావేశారు. మే చివరినాటికి కేసులు దిగివస్తాయని పేర్కొన్నారు. ‘సూత్ర’ అనే పిలిచే గణిత పద్ధతిలో వారు ఈ అంచనాలు రూపొందించారు. ఇంతకుముందు కరోనా తొలి దశ గత ఏడాది సెప్టెంబర్నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని, ఫిబ్రవరి మధ్య నాటికి కేసులు దిగివస్తాయని ఇదే పద్ధతిలో లెక్కగట్టారు. ఐఐటీ కాన్పూర్కి చెందిన ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ.. దేశంలో ఏప్రిల్ 15-20 మధ్యనాటికి కేసులు పీక్ స్టేజికి చేరుతాయని చెప్పారు. మే చివరినాటికి గణనీయంగా కేసులు తగ్గిపోతాయని పేర్కొన్నారు. తొలుత పంజాబ్లో, అనంతరం మహారాష్ట్రలో కేసులు గరిష్ఠస్థాయికి చేరవచ్చని తెలిపారు. స్వతంత్రంగా అంచనాలు రూపొందించిన అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.. దేశంలో ఏప్రిల్ మధ్య నుంచి మే మధ్య నాటికి కేసులు గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రెండో డోస్ తీసుకున్న నెలకు కరోనా
బరేలీ, ఏప్రిల్ 12: కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న దాదాపు నెల తర్వాత ఉత్తరప్రదేశ్కు చెందిన సీనియర్ పోలీస్ అధికారి, ఐజీ రాజేశ్పాండేకి కరోనా సోకింది. తాను ఫిబ్రవరి 5న తొలి డోస్, మార్చి 5న రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్టు ఆయన చెప్పారు.
ఢిల్లీలో నాలుగో వేవ్
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రస్తుతం కరోనా 4వ దశ నడుస్తున్నదని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. అయితే ప్రస్తుతానికి లాక్డౌన్ విధించే ఆలోచన లేదని చెప్పారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ వేసేందుకు రాష్ర్టాలకు అనుమతించాలని కేంద్రాన్ని కోరారు. మునుపటి దశలతో పోలిస్తే నాలుగో దశ తీవ్రత తక్కువేనని, మరణాలు తక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయని వివరించారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్నా భయపడాల్సిన అవసరం లేదన్నారు.
లాక్డౌన్ను భరించలేం
ముంబై: కరోనా ప్రభావం నుంచి సినిమా, రిటైల్, షాపింగ్ రంగాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయని, మరో లాక్డౌన్ విధిస్తే దాన్ని తట్టుకునే పరిస్థితి లేదని ఆయా రంగాల అసోసియేషన్లు ఆందోళన వ్యక్తంచేశాయి. మహారాష్ట్రలో లాక్డౌన్ విధించొద్దని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, రిటైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేశాయి.
మాస్క్ ధరించని వారికోసం తాత్కాలిక జైళ్లు
ఖర్గోన్, ఏప్రిల్ 2: కరోనా విజృంభిస్తున్నా మాస్క్ ధరించడంలో ప్రజలు నిర్లక్ష్యం వహిస్తుండటంతో మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లా యంత్రాంగం కఠిన చర్యలకు సిద్ధమైంది. మాస్క్ ధరించని వారిని జైలుకు పంపేందుకు రెండు తాత్కాలిక జైళ్లను సైతం సిద్ధంచేశారు. ఉల్లంఘనులను కనీసం ఆరుగంటలపాటు జైళ్లలో ఉంచనున్నారు.
ఇవి కూడా చదవండి..
450 మంది టూరిస్టులను రక్షించిన భారత జవాన్లు
థర్మల్ పవర్ ప్లాంట్లకు కొత్త నిబంధనలు
విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. బాధితురాలు ఆత్మహత్య
అస్సాంలో బీజేపీ నేత కారులో ఈవీఎం
60 ఏండ్లు దాటినా.. ఖండాలు మారినా.. అదే ప్రేమ!
స్టాలిన్ అల్లుడి ఇంట్లో ఐటీ సోదాలు
స్పీడ్ ఎక్కువ.. డేంజర్ తక్కువ!