న్యూఢిల్లీ, ఆగస్టు 20: ఏదైనా ఒక రాష్ట్రం పునర్వ్యవస్థీకరణ జరిగి రెండుగా విడిపోయినప్పుడు.. ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ వర్తించే వ్యక్తి, తర్వాత ఏర్పడిన రెండు రాష్ర్టాల్లో ఏదైనా ఒక దాంట్లోనే రిజర్వేషన్ పొందేందుకు అర్హుడని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఏక కాలంలో రెండు రాష్ర్టాల్లో రిజర్వేషన్ పొందలేడని స్పష్టం చేసింది. 2000వ సంవత్సరంలో బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయింది. 2007లో పంకజ్ కుమార్ అనే వ్యక్తికి జార్ఖండ్లో రిజర్వేషన్ క్యాటగిరీలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అయితే అతని పర్మినెంట్ అడ్రస్ బీహార్లో ఉన్న కారణంగా అతనికి రిజర్వేషన్ వర్తించదని రాష్ట్రప్రభుత్వం తెలిపింది. దీంతో పంకజ్ కుమార్ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ అతనికి తీర్పు వ్యతిరేకంగా రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండు రాష్ర్టాల్లో ఏదో ఒక దాంట్లో అర్హత ఉంది కాబట్టి పంకజ్ కుమార్ను ఆరువారాల్లోగా విధుల్లోకి తీసుకోవాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.