న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం వేళ దేశంలో సంభవిస్తున్న విపత్తులు, వాటిని ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీరు గురించి ప్రధాని నరేంద్రమోదీ వివరించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియోలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. గత రెండు వారాల్లో వచ్చిన రెండు తుపాన్లు, వాటిని ఎదుర్కొన్న తీరును గుర్తు చేశారు.
తుపాను సమయంలో సహాయక చర్యల్లో పాల్గొని లక్షలాది మందికి సేవలు అందించిన వారికి తాను సెల్యూట్ చేస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. వారి సేవలు అభినందనీయమని కొనియాడారు. తుపాను ప్రభావిత రాష్ట్రాల్లోని ప్రజలు ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొన్నారని, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు కలిసి పని చేశాయని చెప్పారు. ఈసారి గతంలో కంటే తక్కువ ప్రాణనష్టం జరిగిందన్నారు. తుఫానువల్ల ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.