అమరావతి,జూలై 6: ఒడిషా, పశ్చిమబెంగాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడింది. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలోని కొన్ని చోట్ల ఇవాళ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని చెప్పారు. రేపు కూడా ఉత్తరకోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కొన్నిచోట్ల.. భారీ వర్షాలు మరికొన్ని చోట్ల కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.