సరికొత్త కారును ఆవిష్కరించిన బీఎండబ్ల్యూ
న్యూఢిల్లీ, మార్చి 10: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. దేశీయ మార్కెట్లోకి మరో కారు ను పరిచయం చేసింది. రూ. 62.9 లక్షల విలువైన ఎం340ఐ ఎక్స్డ్రైవ్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బుధవారం ప్రకటించింది. అధిక పనితీరు కనబరిచే ఈ కారును చెన్నై ప్లాంట్లోనే తయారు చేసినట్లు తెలిపింది. 2,988 సీసీ ఆరు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన 387 హెచ్పీ శక్తినివ్వనున్న ఈ కారు కేవలం 4.4 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది.