బాలకృష్ణ సినిమా థియేటర్లోకి వచ్చి దాదాపు రెండేళ్లు అయిపోయింది. అప్పుడెప్పుడో 2019 సంక్రాంతి ఎన్టీఆర్ కథానాయకుడు, మహా నాయకుడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత అదే ఏడాది చివరలో రూలర్ సినిమాతో వచ్చాడు. అయితే ఇవన్నీ దారుణంగా నిరాశ పరిచాయి. దీంతో తర్వాత సినిమా చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు బాలకృష్ణ. కొన్ని కథలు విన్న తర్వాత కూడా నో చెప్పాడు. ఈ క్రమంలో సింహా, లెజెండ్ వంటి హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీనుతో సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. 2021 మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అఖండ సినిమాను విడుదల చేస్తున్నట్లు ఆమెకు అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
కరోనా ఉధృతి కారణంగా టాలీవుడ్లో ఇప్పటికే చాలా సినిమాలు వాయిదా పడ్డాయి.ఇప్పుడు ఇదే బాటలో బాలయ్య కూడా వెళ్తున్నాడు. అఖండ సినిమాను నెల రోజుల పాటు వాయిదా వేయాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. కేవలం అఖండ సినిమానే కాదు.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటించబోయే సినిమా కూడా ఆలస్యం కానుంది. ముందుగా ఈ సినిమాను మేలో మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం మార్చుకున్నారు. బయట ఉన్న పరిస్థితుల దృష్ట్యా జూన్ చివరికి వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.
క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న గోపీచంద్ మలినేని.. బాలయ్యతో కూడా అదిరిపోయే పోలీస్ డ్రామా తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మించబోతుంది. ఈ సినిమా కథ కోసం లైబ్రరీలో పాత పేపర్లు తిరగేస్తూ కనిపించాడు గోపిచంద్. ఏదేమైనా కూడా బాలయ్య అభిమానులకు ఒకేసారి రెండు బ్యాడ్ న్యూస్లు వచ్చాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
పీపీఈ కిట్లో కూరగాయలు కొనడానికి వెళ్లిన హీరోయిన్.. వీడియో
కరోనా టైంలోను ఖాళీ లేకుండా ఫుల్ బిజీ అయిన నాని..!
ఒక్కో పాటకు సిద్ శ్రీరామ్ రెమ్యునరేషన్ తెలిస్తే ఖంగు తింటారు..!
మహేష్ ఖాతాలో మరో రికార్డ్.. మైండ్ బ్లాక్ చేసిన సూపర్ స్టార్
కోవిడ్ సమయంలోను షూటింగ్.. ఇటలీలో బిజీగా ఉన్న అక్కినేని హీరో
శ్రీరామనవమి రోజు ఆదిపురుష్ లుక్ ఎందుకు రిలీజ్ కాలేదు..!