నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 30: కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఆదివారం నిరుపేదలకు నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు, కూరగాయలను పంపిణీ చేశారు. చందూర్, ఇందల్వాయి మండలం నల్లవెల్లి, నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం, గాంధీనగర్ తండా, మల్లారం, ధర్మారం, ధర్పల్లి మండలం ధర్పల్లి, రామడ్గు, రేకులపల్లి, హోన్నాజీపేట్ తండా, దుబ్బాక గ్రామాల్లో జీపీ కార్మికులు, పేదలకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. వర్ని మండలంలోని జలాల్పూర్, డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్పల్లి, రుద్రూర్ మండలంలోని చిక్కడ్పల్లిలో పేదలకు బియ్యం, కూరగాయలు, మాస్కులను పంపిణీ చేశారు.
ఆయా కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలం మంథని, దేగాం గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పార్టీ జిల్లా కోఆర్డినేటర్ పుప్పాల శివరాజ్ పాల్గొన్నారు. పెర్కిట్, ఆర్మూర్, కోటార్మూర్లోని పలు వార్డుల్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. పెర్కిట్ కూరగాయల మార్కెట్లో కూరగాయల వ్యాపారులకు, రైతులకు మాస్కులను, శానిటైజర్లను పంపిణీ చేశారు. పాదచారులకు, యాచకులకు ఆహార పొట్లాలను పంపిణీ చేసి చిన్న పిల్లలకు అరటిపండ్లు, బిస్కెట్లను అందజేశారు. కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు. మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్, పాలెం, సుంకెట్, వడ్యాట్, దోన్పాల్ గ్రామాల్లోని నిరుపేదలు, వలసకార్మికులు, పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్ర నాయకుడు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి సహకారంతో నిత్యావసర వస్తువులు, మాస్కులు, శానిటైజర్లు, పండ్లు పంపిణీ చేశారు. రెంజల్ మండలంలోని పలు గ్రామాల్లో నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు.