న్యూఢిల్లీ: 102వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. కేవలం పార్లమెంట్కు మాత్రమే ఎస్ఈబీసీ (సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) జాబితాను రూపొందించే అధికారం ఉన్నట్లయితే, మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని ఆమోదించకూడదని సుప్రీంకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. ఎందుకంటే, ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఆ చట్టం రూపొందించే అధికారం లేదని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొన్నది.