న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి టీకా ఉత్సవ్ ప్రారంభమయ్యింది. నేటి నుంచి నాలుగు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. కార్యక్రమంలో భాగంగా 45 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం సంకల్పించింది. ఇందుకోసం యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసింది. కానీ, ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాలు టీకా కొరతను ఎదుర్కొంటున్నాయి. టీకాలు నిలువలు నిండుకున్నాయని కేంద్రం దృష్టికి తీసుకొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ టీకా ఉత్సవ్ కార్యక్రమం ప్రారంభించడంతో వ్యాక్సినేషన్కు తాము రెడీగానే ఉన్నాం కానీ, టీకాలు ఇప్పించండి అంటూ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానికి లేఖలు రాస్తున్నారు. మీరిచ్చిన ఆదేశాలను ఆచరణలో పెట్టాలంటే తగినన్ని వ్యాక్సిన్లు సమకూర్చాలని కోరుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ, రాజస్థాన్ మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో వ్యాక్సిన్లు నిండుకుంటున్నాయి.
దాంతో వ్యాక్సిన్లు లేకుండా టీకా ఉత్సవ్ ఎలా నిర్వహించాలని రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. టీకా ఉత్సవ్ నిర్వహించాలంటే తమకు తక్షణమే 30 లక్షల డోసుల టీకాలు అందించాలని తెలంగాణ సర్కార్ కోరగా, తమకు కూడా 25 లక్షల డోసులు కావాలని ఏపీ సర్కార్ ప్రధానికి లేఖ రాసింది. అదేవిధంగా రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఒడిశా, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇప్పటికే తమకు సరిపడా టీకాలు సమకూర్చాలని కేంద్రానికి లేఖలు రాశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
వ్యాక్సినేషన్ రికార్డు.. 85 రోజుల్లోనే 10 కోట్ల మందికి టీకా
నాలుగు రోజుల టీకా ఉత్సవ్.. నాలుగు సూచనలు చేసిన మోదీ
తెలంగాణలో కొత్తగా 3,187 కరోనా కేసులు
దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. 24గంటల్లో 1.53లక్షల కేసులు